పెద్దపల్లి జిల్లా జేఏసీ కన్వీనర్లుగా పోలం సతీష్ యాదవ్, కల్లెపల్లి రవిలను నియమించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్నీ బుధవారం వారికి నియామక పత్రాలు అందజేశారు. గుజరాత్, రాజస్థాన్ నుండి వచ్చిన మార్వాడీలు స్థానికుల వ్యాపార, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని, రాష్ట్రంలో అనేక రంగాల్లో స్థానికులు ఉపాధి కోల్పోయేలా చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.