పెద్దపల్లి జిల్లా, రామగుండంలో అకాల వర్షాల కారణంగా తూముపల్లి కొండాపూర్ చెరువు కట్ట తెగి, సెల్ టవర్ నీట మునిగింది. టవర్ పరికరాలు దెబ్బతినడంతో ప్రజలకు ఫోన్ సదుపాయం నిలిచిపోయింది. ఈ మారుమూల ప్రాంతంలో ప్రత్యామ్నాయ టవర్ లేకపోవడంతో, సీనియర్ ఇంజనీర్ సిద్ధార్థ తన బృందంతో కలిసి, నీళ్లలోనూ విద్యుత్ షాక్ భయం లేకుండా పనిచేసి, సెల్ టవర్ను తిరిగి నిర్మించారు. ఈ చర్యను గ్రామస్తులు అభినందించారు. సెల్ టవర్ యజమానులు సిద్ధార్థ, వరుణ్ సాయి తేజలను ప్రశంసించారు.