పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) సెదంక శ్రీమాన్, భూభారతి చట్టం, 2025 ప్రకారం భూమికి సంబంధించిన నివేదికను తహసీల్దార్కు పంపేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ యూనిట్ ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. అతనిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.