పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన వందరోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేశామని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి తెలిపారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో మహాత్మ జ్యోతిబా బాలుర పాఠశాలలో
విద్యార్థులు ‘100’ ఆకారంలో నిలిచి ఆకర్షించారు. పట్టణంలో మంచినీటి స్వచ్ఛత
పరీక్షలు కూడా నిర్వహించినట్టు అధికారులు శంకర్రావు, కిరణ్ తెలిపారు.