పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రోడ్డు భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డిసిపి కరుణాకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజలు పాల్గొన్నారు.