నేడు చంద్రగ్రహణం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని చంద్రబాబు కాలనీ నాగదేవతల దేవాలయం ప్రధాన అర్చకులు కందుకూరి జగదీశ్వరాచార్యులు మాట్లాడుతూ, మంగళవారం నాగదేవతల ఆలయాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. గ్రహణ నేపథ్యంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రహణం తర్వాత ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు ఉంటాయని, సింహరాశి, కర్కటక, మిధునం, మకర రాశివారు ఈ గ్రహణాన్ని చూడొద్దని తెలిపారు.