
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే విజయ రమణారావుకు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, ఖాజాలు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీల నిధుల ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బంది అందరినీ 2వ పిఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.





























