తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పింఛన్ల దారులకు గుడ్న్యూస్ చెప్పారు. ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని, అర్హులకే పింఛన్లు అందేలా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఓటర్ ఐడీ, ఆధార్, ఎస్ఈఈపీసీ డేటా ఆధారంగా పింఛన్ల పంపిణీని స్ట్రీమ్లైన్ చేయాలని, కొత్త పింఛన్లలో ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.