AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై ఐదు రోజుల్లో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో గవర్నర్కు నివేదిక ఇచ్చేలా పోలీస్ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. మొత్తం 20 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిల్ త్వరలోనే హైకోర్టులో విచారణకు రానుంది.