హైదరాబాద్‌-లండన్‌ విమానంలో పైలట్లకు అస్వస్థత

3286చూసినవారు
హైదరాబాద్‌-లండన్‌ విమానంలో పైలట్లకు అస్వస్థత
హైదరాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. విమానం 30వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక పైలట్‌కు ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ముగ్గురు పైలట్లు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో అల్పాహారం తిన్నట్లు తెలుస్తోంది, ఫుడ్‌ పాయిజినింగ్‌ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్