తెలుగు టైటాన్స్ జట్టు PKL 2025లో అదరగొడుతోంది. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఆదివారం జరిగిన మినీ మినీ-క్వాలిఫైయర్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై 37-32 తేడాతో గెలిచింది. తెలుగు టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ మాలిక్ 11 పాయింట్లతో రాణించారు. అలీ రెజా 11 పాయింట్లు సాధించినా బెంగళూరు ఓటమి పాలైంది. మరో వైపు ఎలిమినేటర్ 1లో జైపూర్ పింక్ పాంథర్స్ను పాట్నా పైరేట్స్ 44-29 తేడాతో ఓడించించింది.