ప్రస్తుతం చలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని రిజర్వు బ్యాంక్ ఆఫ్
ఇండియా (RBI) తీసుకురాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ ఏడాది జూన్ 30 నుంచే ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.