టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం తనకు ఎంతో ప్రత్యేకమని యువ క్రికెటర్ హర్షిత్ రాణా పేర్కొన్నారు. 'బుమ్రా జట్టులో ఉంటే అది అదనపు బలం. బుమ్రా పరిస్థితులను మాకు అనుకూలంగా మారుస్తాడు. అతడు మనతో ఉంటే.. మనమీద చాలా తక్కువ ఒత్తిడి మాత్రమే ఉంటుంది.' అని హర్షిత్ తెలిపాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో హర్షిత్ బుమ్రాతో కలిసి ఆడాడు. 2025 ఆసియా కప్ భారత జట్టులో హర్షిత్కు చోటు దక్కింది.