ఐపీఎల్లో ఫిక్సింగ్కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదు ప్రముఖ టీమ్ ఫ్రాంచైజీలను ఒక వ్యాపారవేత్త సంప్రదించినట్లుగా ఆధారాలను BCCI సేకరించింది. అయితే ఆధారాలు ఉంటే ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులు BCCIని కోరారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు వ్యాపారవేత్తలపై అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు.