TG: హైదరాబాద్ KPHB కాలనీలోని పలు హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. తాజాగా రోడ్ నం. 3లోని OYO హోటల్లో అధికారులు సోదాలు జరుపగా 6 కిలోల గంజాయి పట్టుబడింది. OYOలో రూమ్ అద్దెకు తీసుకొని ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు.