
రాహుల్ గాంధీతో పాటు మెస్సీ మ్యాచ్ ను వీక్షించనున్న తన మేనల్లుడు
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాకతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సందడి నెలకొంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నారు. ఈ మ్యాచ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి ఆడనున్నారు. వీరి ఆటను చూసేందుకు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తన మేనల్లుడితో కలిసి ఈ మ్యాచ్ను వీక్షించడానికి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




