దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన గాలి కాలుష్యం కారణంగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 391కి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఎన్సీఆర్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అవుట్డోర్ యాక్టివిటీస్పై నిషేధం విధించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేదు.