SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా టియాంజిన్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ఫలవంతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశం-చైనా సంబంధాలలో సానుకూల అంశాలను సమీక్షించామన్నారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం కోసం ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. ఇరుదేశాల పురోగతి 'డ్రాగన్-ఏనుగు' కలిసి నడవాలని ఈ సమావేశంలో జీ జింగ్ పింగ్ అన్నారు.