మహిళల వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత సంబరాల్లో భారత మహిళా క్రికెటర్ ప్రతీకా రావల్ పాల్గొన్నారు. సౌతాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత భారత త్రివర్ణ పతాకాన్ని ధరించి వీల్చైర్లో ఆమె తిరిగారు. బంగ్లాదేశ్తో మ్యాచ్ సమయంలో గాయం వల్ల ఆమె టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. 'నేను ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఛాంపియన్ జట్టులో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని మీడియాతో పేర్కొన్నారు.