
ఆన్లైన్ బెట్టింగ్లకు రాజ్యాంగ రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు
ఆన్లైన్ బెట్టింగ్ అనేది నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినప్పటికీ దానికి రాజ్యాంగ రక్షణ ఉండబోదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్లను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక చేసిన చట్టాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితం, శాంతి భద్రతల దృష్ట్యా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది.




