ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అమిత్ షా ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ను ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అమిత్ షా పరామర్శించారు.