తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల క్రితం మాతృభూమి గురించి మాట్లాడి అధికారంలోకి వచ్చిన టీఎంసీ, ఇప్పుడు ఆ మాటలు చెప్పలేకపోతోందని ఆయన అన్నారు. టీఎంసీ ఆ మాటలు చెబితే వారి పాపాలు బయటపడతాయని, వారి క్రూరత్వం మాతృభూమిని ఏడిపించిందని ప్రధాని ఆరోపించారు.