
ఆర్సీబీ రూ.5.2 కోట్లకు కొన్న మంగేష్ యాదవ్ ఎవరు?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చిన ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్ను రూ.5.2 కోట్లకు కొనుగోలు చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో తీవ్ర పోటీ తర్వాత, మధ్యప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన మంగేష్ను ఆర్సీబీ దక్కించుకుంది. యశ్ దయాల్కు బ్యాకప్గా ఈ యార్కర్ స్పెషలిస్ట్ను కొనుగోలు చేశారు. మంగేష్ మధ్యప్రదేశ్ టీ20 లీగ్లో అత్యధిక వికెట్లు తీసి, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.




