జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అక్కడి గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్పై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పది మంది విద్యార్థులు ఉండటం సంచలనం రేపుతోంది. ఈ ఘటనతో హాస్టల్ భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాలేజీల్లో చదువుతున్న యువతులు డబ్బుల కోసం ఇలా దారితప్పుతున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.