కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మాన్వి తాలూకాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయింది. నిరుద్యోగ మహిళలకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, వారిని వ్యభిచార గృహంలోకి నెడుతున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ దందాను నడుపుతున్న కింగ్పిన్ తాయప్పతో పాటు మొత్తం 11 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.