ఇరాన్లో గత రెండు వారాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 72 మంది మృతి చెందగా, 2,300 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిరసనకారులకు మద్దతుగా అమెరికా నిలుస్తూ, కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. దీంతో ఇరాన్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేశారు.