తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన ఉత్సవాలు' ఘనంగా నిర్వహించానున్నారు. నేటి నుంచి ఈ నెల 9 వరకు రోజూ ఒక ఉమ్మడి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.