పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. దీంతో ఆమె సురక్షితంగా భారత్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.