
విశాఖను ఐటీ హబ్గా మారుస్తాం: మంత్రి లోకేష్
విశాఖపట్నం ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ను మించిపోయేలా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే పదేళ్లలో విశాఖ నగరం ఒక ప్రధాన ఐటీ హబ్గా రూపుదిద్దుకుంటుందని, ఇందుకోసం పూర్తి ఎకో సిస్టంను అక్కడ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. డేటా సెంటర్లను తీసుకురావడమే కాకుండా, వాటి నిర్వహణ కూడా కీలకమని, పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.




