TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని భావించినా, అవి ముందుగానే రావడంతో తొలకరి జల్లులను రైతులు సంతోషంగా స్వాగతిస్తున్నారు. మరోవైపు, పట్టణ, నగర ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.