అమృత్సర్ నుంచి బర్మింగ్హామ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ 787-8 విమానంలో శనివారం టెక్నికల్ లోపం కలకలం రేపింది. ల్యాండింగ్కు ముందు అత్యవసర సమయాల్లో మాత్రమే ఆన్ అయ్యే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (RAT) వ్యవస్థ అనూహ్యంగా యాక్టివేట్ కావడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది.