
రూ.10వేల కోట్లు ఇవ్వండి: ఎయిరిండియా
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో, సంస్థ పునరుద్ధరణకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ల నుండి రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం కోరినట్లు తెలుస్తోంది. ఈ నిధులను విమాన భద్రత, ఇంజినీరింగ్, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడానికి, సేవలను విస్తరించడానికి ఉపయోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాటా గ్రూప్కు 74.9 శాతం, సింగపూర్ ఎయిర్లైన్స్కు మిగిలిన వాటా ఉంది.




