రాజేంద్ర నగర్ చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి ఓల్డ్ మలక్పేట్లో “గ్రీన్ నెస్ట్ వాటర్” పేరుతో నడుస్తున్న అక్రమ నీటి ప్లాంట్పై దాడి చేశారు. ఈ దాడిలో, ప్లాంట్కు సరైన అనుమతులు లేవని, అనారోగ్యకర పరిస్థితుల్లో తాగునీరు తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ నీటి ప్లాంట్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.