చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీలోని శ్రీ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే భక్తులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.