క్షతగాత్రులకు మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శ..

526చూసినవారు
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మహాలింగాపురంలో ఎన్ సి సి ఫ్యాబ్రికేషన్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం ఈదురు గాలులు, భారీ వర్షానికి క్రేన్లు కూలి షెడ్డుపై పడటంతో 17 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘటనాస్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్