
ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ (వీడియో)
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఛైర్మన్ ఎన్నికను ఆపాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

































