బీఎన్ రెడ్డి నగర్ ఫేస్-1 కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. కాలనీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా కార్యవర్గసభ్యులు బుధవారం కార్పొరేటర్ లచ్చిరెడ్డిని కలిసి తమ కాలనీలోని సమస్యలను ఆయనకు వివరించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్ ను కలిసిన వారిలో పురుషోత్తంరెడ్డి, ధనరాజ్, శ్రీనివాస్ ఉన్నారు.