రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 'రాష్ట్రీయ ఏక్తా దివాస్' 2K రన్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లెలగూడ చందన చెరువు నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు జరిగిన ఈ రన్ను ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ ప్రారంభించారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్ జయంతి సందర్భంగా జరుపుకునే ఈ దినోత్సవం ఐక్యత, దేశభక్తి, సేవా స్పూర్తిని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.