షాద్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు, ధృవపత్రాల సంబంధిత సేవలు, ఇతర ఆన్లైన్ ప్రక్రియలు సర్వర్ సమస్య కారణంగా నిలిచిపోయాయని సిబ్బంది తెలిపారు. సాంకేతిక లోపాన్ని త్వరితగతిన పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.