పరిగి - Pargi

తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఎండలు: ప్రజలు అల్లాడుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఎండలు: ప్రజలు అల్లాడుతున్నారు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, నిన్నటి ద్రోణి/గాలి అంతరాయం ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

వీడియోలు


వికారాబాద్ జిల్లా
Apr 25, 2026, 14:04 IST/

నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్...

Apr 25, 2026, 14:04 IST
సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరు వెండి వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని భారీ స్కామ్ కు పాల్పడుతున్నారు. అంబర్పేట్ డిసిపి ఆఫీసులో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రక్షితమూర్తి మాట్లాడుతూ, శ్రీ జగదాంబ ఇండస్ట్రీస్ యజమాని హిరాలాల్ వర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ముఠా మొదట స్వచ్ఛమైన వెండిని చూపించి, ఆ తర్వాత నాణ్యతలేని వెండితో మోసాలకు పాల్పడుతోంది. వీరి వద్దనుండి సుమారు 15 లక్షల విలువైన 6.50 కిలోల వెండిని రికవరీ చేశారు.