రాజేంద్రనగర్ - Rajendranagar

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు డిమాండ్!

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు డిమాండ్!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే విమానంలో బాంబు పెట్టామని, తక్షణమే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తి నుంచి ఎయిర్‌పోర్టు అధికారులకు మెయిల్ వచ్చింది. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించారు. ప్రాథమిక విచారణలో మెయిల్ పంపిన వ్యక్తి యూఎస్‌కు చెందిన జాస్పర్ అని గుర్తించారు. ఈ ఏడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 20కి పైగా బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చినట్లు డీసీపీ రాజేశ్ తెలిపారు. గతంలో కూడా లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
టీతో బిస్కెట్లు: ఆరోగ్యానికి పెను ముప్పు!
Dec 10, 2025, 01:12 IST/

టీతో బిస్కెట్లు: ఆరోగ్యానికి పెను ముప్పు!

Dec 10, 2025, 01:12 IST
టీ, బిస్కెట్‌ కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థ, రక్తంలో చక్కెర, జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లు టీతో తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. టీలోని కెఫిన్, టానిన్లు ఖాళీ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. బిస్కెట్లలోని శుద్ధి చేసిన పిండి, చక్కెర ఆమ్లత్వాన్ని, గుండెల్లో మంటను మరింత ప్రేరేపిస్తాయి. ఈ కలయిక పేగులలోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది. బరువు, గ్యాస్, కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది. మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుందని వివరిస్తున్నారు.