శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం రేగింది. గతంలో ఎబోలా చరిత్ర కలిగిన సుడాన్ దేశస్థుడైన మహమ్మద్ను అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ముందు జాగ్రత్త చర్యగా అతడిని గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్కు తరలించారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్ పక్కాగా జరుగుతోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.