రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలోగల రిద్ధిస్ గ్రాండ్ యువర్ అపార్ట్మెంట్లో మూడవ అంతస్తులోని ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాష్ ఏరియాలో వాషింగ్ మెషిన్కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఫ్లాట్ యజమాని తన భార్య, ఇద్దరు పిల్లలను సకాలంలో బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. నివాసితులు భయాందోళనకు గురయ్యారు.