రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గల మణికొండ నెక్నాంపూర్ లో హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా కమీషనర్ రంగనాథన్ అదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.