హైదరాబాద్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. తమకు వాటాలున్నాయని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వాటాలున్నాయని నిరూపిస్తే వాళ్లకే రాసిస్తానని చెప్పారు.