
బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్టు
బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని గోకుల్ లాడ్జిలో ర్యాపిడో డ్రైవర్ రాజు (26) ఓ మైనర్ బాలికను (17) తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మైనర్తో వచ్చిన వ్యక్తికి గుర్తింపు కార్డు తీసుకోకుండా గది ఇచ్చినందుకు లాడ్జి నిర్వాహకుడు ఆనందరావు (64)ను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.






































