శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్లలో విద్యుత్ అధికారులు శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు ప్రతి వీధిలో పర్యటించి, కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకొని, తక్షణమే పరిష్కరించారు. ఈ డ్రైవ్లో లైన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మం, లైన్మ్యాన్ రాజు నాయక్, మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.