రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం లాల్సింగ్ తండాలో పోలీసులు, ఎస్వోటీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పాత్లావత్ కవిత ఇంట్లో సోదాలు చేయగా, 22 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. చౌదరిగూడ వ్యవసాయ శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, షాద్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.