కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న సహకారంతోనే ఇది జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి అంజి నాయక్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో నూతన స్తంభాల ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.