ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి భారీ విరాళం

726చూసినవారు
షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి నాట్కో పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షల భారీ విరాళం అందించింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా నాట్కో ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మేనేజర్ సత్యనారాయణ చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని అందుకున్న ఎమ్మెల్యే శంకర్, తన సంకల్పానికి గుర్తింపు లభించిందని, మంచి పని కోసం ప్రోత్సహించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కళాశాల నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు.